న్యూఢిల్లీ, 14 జూలై (హి.స.)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హర్యానా గవర్నర్ గా ఆషింకుమార్ ఘోష్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..