జమ్మూ కాశ్మీర్, 30 జూలై (హి.స.)
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పూంచ్ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా పరిధి కస్లియాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సరిహద్దు దాటి భారత్ వైపు చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల బృందాన్ని బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్కివున్న ఉగ్రవాదుల కోసం సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..