శాంతి భద్రతల దృష్ట్యా జిల్లాలో పోలీసు యాక్ట్.. ములుగు ఎస్పీ
తెలంగాణ,ములుగు: 4 జూలై (హి.స.)శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఇవాల్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ములుగు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,
ములుగు ఎస్పి


తెలంగాణ,ములుగు: 4 జూలై (హి.స.)శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఇవాల్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ములుగు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారం అందించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande