హైదరాబాద్, 5 జూలై (హి.స.)
, : నిబంధనలను ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు రవాణాశాఖ పేర్కొంది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. మద్యం తాగి లేదా మాదకద్రవ్యాలు తీసుకుని, అతి వేగంతో డ్రైవింగ్ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. వివరాలివి..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ