విశాఖపట్నం, 6 జూలై (హి.స.)
, దుబాయ్ వేదికగా గత నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన అందం, ప్రతిభ (మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్-2025) పోటీల్లో భారత్ తరఫున విశాఖ నగరానికి చెందిన యువతి దిశా పల్నాటి విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో 19 దేశాల నుంచి 60 మంది పాల్గొన్నారు. ఈమె తన పాఠశాల విద్య నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో పూర్తి చేసింది. ప్రస్తుతం మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది. ఈమె మిస్టీన్స్ గ్రాండ్ సీ 2025, ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. ఈమె అభిరుచులకు అనుగుణంగా తల్లి వాలెంటినా మిశ్రా అన్నివిధాలా శిక్షణ ఇచ్చి సహకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ