క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?
న్యూఢిల్లీ:11,సెప్టెంబర్ (హి.స.) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్‌డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్‌ ఓటింగ్‌ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి ఓటేయకుండా రాధాక
క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?


న్యూఢిల్లీ:11,సెప్టెంబర్ (హి.స.) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్‌డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్‌ ఓటింగ్‌ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్‌ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి.

ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్‌ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్‌ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande