న్యూఢిల్లీ, 13 సెప్టెంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీ నగరం
మరోసారి ఉలిక్కిపడింది. ఇవాళ మధ్యాహ్నం లోపు పేల్చేస్తామంటూ తాజ్ ప్యాలెస్ హోటల్కు ఆగంతకులు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. హోటల్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతోందని అందులోని సారాంశం. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు డాగ్, బాంబ్ స్వ్కాడ్తో ఘటనా స్థలానికి చేరుకుని విస్తృంతా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులు, బ్యాగేజీలను దూరంగా తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. ఇక శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని బాంబే హైకోర్టు అధికారులకు దక్షిణ ముంబైలోని చారిత్రక కోర్టు భవనాన్ని కూల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రాగా.. బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఎలాంటి బాంబులు లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు