దిల్లీ:/లివర్పుల్ 14 సెప్టెంబర్ (హి.స.)
: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్గా నిలిచారు. లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె పోలండ్కు చెందిన జూలియాను 4-1 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. మరోవైపు భారత్కు చెందిన నుపుర్ షెరోన్ (80 కేజీల పైన) రజత, పూజారాణి (80 కేజీలు) కాంస్య పతకం సాధించారు. పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ