దుబాయ్ , 14 సెప్టెంబర్ (హి.స.)ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో భారత్-పాకిస్తాన్ (India vs Pakistan live) మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రూప్ ఏలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ సంవత్సరం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో మైదానంలో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
భారత్లో ఈ మ్యాచ్ను సోనీ లివ్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. అలాగే, సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్డీ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ప్రాంతీయ భాషలలో చూడాలనుకునే వారికి సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హెచ్డీ (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం & తెలుగు) ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. మ్యాచ్ సాయంత్రం 8:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా మంచి ఫామ్తో బరిలోకి దిగుతున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్లో యూఏఈని 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ హాంకాంగ్పై 93 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయాలతో రెండు జట్లూ సూపర్ ఫోర్కు అర్హత సాధించేందుకు పోటీపడుతున్నాయి.
ఎనిమిది సార్లు..
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 జట్టుగా ఉన్న భారత్, ఆసియా కప్లో ఎనిమిది సార్లు టైటిల్ గెలిచిన రికార్డుతో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ భారత్కు బలంగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి