న్యూఢిల్లీలో రోడ్డుప్రమాదం.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి
న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ధౌలా కూన్ సమీపంలో ఓ బైకును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్ జ్యోత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో
ఢిల్లీ ఆక్సిడెంట్


న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ధౌలా కూన్ సమీపంలో ఓ బైకును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్ జ్యోత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో అతని భార్యతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నవ్యోత్ సింగ్ తన భార్యతో కలిసి బైక్పై బంగ్లా సాహిబ్ గురుద్వారా వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో రింగురోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు బైకును ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటుకుని రోడ్డు అవతలివైపు వెళ్లి ఆగిపోయింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande