అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)కు చైర్మన్, నలుగురు సభ్యుల నియామకం కోసం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్గా పని చేసిన ఏ.శివారెడ్డి (A.Shiva Reddy)ని నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ (S Suresh Kumar) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి