అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) ఇటీవల ఏసీబీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా.. ఆ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలులో సరెండర్ అయ్యారు. తాజాగా మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) వాదనలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ (CBI) వాదించగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫున లాయర్ విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి