అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ఉద్యమంలా చేస్తున్నాం.. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభంలో స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీ పై జరిగిన చర్చలో ఆయన మాట్టాడారు.
మొదటిసారి సింగపూర్ వెళ్లి అక్కడ పరిస్థితిని అధ్యయనం చేశామని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్లో నైట్క్లీనింగ్ను ప్రారంభించామన్నారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యంగా డ్రెయిన్ల శుభ్రతపై చర్యలు తీసుకోలవాలని తెలిపారు. వర్షపు నీరు, ఇళ్లలోకి నీరు వస్తే ఇంకపోయేలా కొత్త టెక్నాలజీని తీసుకొస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి