హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)
పీవీ నరసింహారావు పశువైద్య
విశ్వవిద్యాలయం 55 స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అంతకుముందు గవర్నర్ కు ఉపకులపతి జ్ఞాన ప్రకాష్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2023-2024 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన 524 మంది విద్యార్థులకు డిగ్రీలు, ప్రశంస పత్రాలు ప్రధానం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..