కోకాపేటలో దారుణం.. కూరగాయల కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని కోకాపేట్లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయల కత్తితో పొడిచి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాం కు చెందిన దంపతులు భరత్ బోరా, కృష్ణ జ్యోతి బోరాలు కొకాపేట్లో కార్మికుల
మర్డర్మర్డర్


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలోని కోకాపేట్లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయల కత్తితో పొడిచి హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాం కు చెందిన దంపతులు భరత్ బోరా, కృష్ణ జ్యోతి బోరాలు కొకాపేట్లో కార్మికులుగా పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి చిన్న విషయానికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివక్ష కోల్పోయిన భార్య.. తన భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసింది. దీంతో భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న చుట్టుపక్కల వారు.. ఇంటి లోపలికి వచ్చి చూడగా రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి భార్య కృష్ణ జ్యోతిని అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande