తెలంగాణ, హుజురాబాద్. 21 సెప్టెంబర్ (హి.స.)
ఇల్లందకుంట మండలంలోని
ఈ సిరిసేడు గ్రామంలో హుజురాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో ఆదివారం
కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలో సరైన పత్రాలు లేని సుమారు 72 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ మాధవి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా సంచరిస్తే సమాచారం అందించాలని, వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను వెంటనే నెంబర్ ప్లేట్ అమర్చుకోవాలని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఐలు ముగ్గురు ఎస్సైలు సబ్ డివిజన్ కోర్స్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు