హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో
జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్పీడీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎ ప్యానెల్ లు పోటీ చేశాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో పాల్గొన్నాయి.
ఈ ఎన్నికల్లో క్యాంపస్ లోని అర్హత గల 81 శాతం విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ విభాగాలలోని 29 పోలింగ్ బూత్లలో ఓపికగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు 40 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఎస్ ఎల్ వీడి ప్యానెల్ అన్ని ప్రధాన స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు