బాపట్ల జిల్లా, 21 సెప్టెంబర్ (హి.స.): మార్టూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ