ప్రధాని మోడీ తల్లిపై మరోసారి దుర్భాషలు.. తేజస్వీ ర్యాలీలో ఘటన
న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వా
modi


న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)

బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని తల్లి దివంగత హీరాబెన్ మోడీని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ వీడియో నకిలీది అని చెప్పారు.

బీహార్ బీజేపీ ఎక్స్‌లో తేజస్వీ యాదవ్-ఆర్జేడీ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్నట్లు చూపిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆర్జేడీ నిర్వహిస్తున్న బీహార్ అధికార్ యాత్రలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande