ముంబై, 24 సెప్టెంబర్ (హి.స.)పసిడి పరుగులు పెడుతోంది. ఆల్టైం హైకి చేరుకొని.. ఎవ్వరూ ఊహించనంత రీతిలో ధరలు ఆకాశాన్నంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది కల్లా రూ. 2 లక్షల మార్క్ చేరుకుంటుందని అంటున్నారు. ఆర్థిక అనిశ్చితి. డాలర్ బలహీనత. ఫెడ్ వడ్డీరేట్లు, జియో పాలిటిక్స్, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతంగా పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నవరాత్రి పండుగ వేళ కూడా బంగారం పైపైకి ఎగబాకుతోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 3550 మేరకు పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 3260 మేరకు పెరిగింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. గడిచిన మూడు రోజుల్లో రూ. 5100 మేరకు ఎగబాకింది. మరి ఇవాళ బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..
22 క్యారెట్ల బంగారం
చెన్నై – రూ. 1,06,410
బెంగళూరు – రూ. 1,06,060
ఢిల్లీ – రూ. 1,06,210
కోల్కతా – రూ. 1,06,060
ముంబై – రూ. 1,06,060
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి