తెలంగాణ, సంగారెడ్డి. 25 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు
చేస్తున్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెనువెంటనే ఆర్జీలను పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య అన్నారు. గురువారం జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో కలెక్టరేట్ సమావేశమందిరంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన పూర్తి వివరాలు జత చేసి తహసిల్దార్ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయానికి ఆర్డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ కు పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు