హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
ఎస్ఆర్ నగర్లో ట్రావెల్స్ బస్సులో అగ్ని అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సును ఆపేసిన డ్రైవర్ రోడ్డుపైనే ఆపేశాడు. ప్రయాణికుల్ని కిందకు దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ