దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.)వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేసే పిల్లలను, వారి ఆస్తి నుంచి వెళ్ళగొట్టే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల సంక్షేమాన్ని కాపాడేందుకే ప్రభుత్వం 2007లో ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్’ను అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం ఏర్పడిన ట్రైబ్యునల్, తల్లిదండ్రుల హక్కులను రక్షించడంలో భాగంగా పిల్లలపై అవసరమైతే గృహనిర్వాస ఆదేశాలు కూడా జారీ చేయవచ్చని కోర్టు స్పష్టంచేసింది.
ఈ తీర్పు, మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల తండ్రి, 78 ఏళ్ల తల్లి వేసిన పిటిషన్పై వెలువడింది. వీరు తమ పెద్ద కుమారుడిపై చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేశారు. హైకోర్టు, గృహనిర్వాసం చేయించే అధికారమే ట్రైబ్యునల్కి లేదని చెబుతూ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ