విజయవాడ హైవే పై నరకం.. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ న
ట్రాఫిక్ జామ్


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్-విజయవాడ జాతీయ

రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మార్గంలో హయత్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పండుగకు వెళ్లే వాహనాలకు తోడు భారీ వర్షాలు తోడవడంతో ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లాలకు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ వద్ద మళ్లిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande