విజయవాడ, 27 సెప్టెంబర్ (హి.స.)ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. (Vijayawada) విజయవాడ కనకదుర్గ (Kanakadurga Temple) ఆలయ కమిటీని నియామకం జరిగింది. ఈ మేరకు దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులు(Board Members)గా 16 మందిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులు..
1.అవ్వారు శ్రీనివాసరావు -విజయవాడ వెస్ట్ -బీజేపీ
2.బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
3.గూడపాటి సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
4.జీవీ నాగేశ్వర్ రావు - రేపల్లె – టీడీపీ
5.హరికృష్ణ - హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
6.జింకా లక్ష్మీ దేవి - తాడిపత్రి – టీడీపీ
7.మన్నె కళావతి -నందిగామ -టీడీపీ
8.మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
9.పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
10.పనబాక భూలక్ష్మి - నెల్లూరు రూరల్ – టీడీపీ
11.పెనుమత్స రాఘవ రాజు -విజయవాడ సెంట్రల్ – బీజేపీ
12.వెలగపూడి శంకర్ బాబు -పెనమలూరు – టీడీపీ
13.సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ -టీడీపీ
14.తంబాళపల్లి రమాదేవి – నందిగామ -జనసేన
15.తోటకూర వెంకట రమణారావు - తెనాలి - జనసేన
16.అన్నవరపు శివ పార్వతి - పెనమలూరు - టీడీపీ
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి