తెలంగాణ, ఆసిఫాబాద్. 28 సెప్టెంబర్ (హి.స.)
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల
మేరకు కాగజ్ నగర్ మండలం ఇస్లాం గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 50 టూ-వీలర్స్, 5 ఆటోలను సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. గంజాయి, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసుల సమాచారం అందించాలని సీఐ ప్రేమ్ కుమార్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు