అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం తాడిపత్రికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుప్రీం కోర్టు అనుమతి ఉన్నందున ఇక తనకు అడ్డు చెప్పవద్దని ఆయన పోలీసులను కోరినట్లు తెలిసింది. ఈ విషయం తెలిగాయనే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటిలాగే తన ఏర్పాట్లు తాను ప్రారంభించారు. మార్కెట్ యార్డులో గోడౌన్ ను బుధవారం ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా మూడు రోజుల క్రితం పట్టణంలో ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇప్పుడు పెద్దారెడ్డి వచ్చేందుకు సిద్ధం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ