నెల్లూరు3 సెప్టెంబర్ (హి.స.)
:అనాదిగా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి(ని జిల్లా చేయాలని మంగళ వారం డిప్యూటీ తహసీల్దారు షాజియాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినందున ఈప్రాంత స్థితిగతు లను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉదయగిరి అభివృద్ధి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అల్లూరి రవీంద్ర, కిరణ్కుమార్, రవి, మహేష్, కేశవ్, సురేష్, మాల్యాద్రి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ