తొర్రూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
తెలంగాణ, మహబూబాబాద్. 30 సెప్టెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని దుబ్బ తండా సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, గత బీఆర్ఎస
డబుల్ బెడ్ రూమ్


తెలంగాణ, మహబూబాబాద్. 30 సెప్టెంబర్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని దుబ్బ తండా సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఈ ఇండ్లను పంపిణీ చేయాలనే డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు. గత ఏడాది నుండి అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు జరగాలని అనేక సార్లు అధికారులను కోరినా స్పందన రాకపోవడంతో, గృహప్రవేశానికి మంగళవారం ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరుపేదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే పోలీసులు ఎంత ఆపినా కూడా నిరుపేదలు చొరబడి వెనకడుగు వేయకుండా ఇండ్లలోకి కొబ్బరికాయలు కొట్టి, అగర్ బత్తీలు వెలిగించి గృహప్రవేశం పూర్తి చేశారు. దీంతో ఒక దశలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande