అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)
రాగల 3 గంటల్లో విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ