విశాఖ.నగరంలోని ఓల్డ్ టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
విశాఖపట్నం, 30 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని ఓల్డ్‌ టౌన్‌ పరిధి కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 148 ఏళ్ల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. 7 కేజీల బంగ
విశాఖ.నగరంలోని ఓల్డ్ టౌన్  కురుపాం మార్కెట్ ప్రాంతంలో  ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు


విశాఖపట్నం, 30 సెప్టెంబర్ (హి.స.)

నగరంలోని ఓల్డ్‌ టౌన్‌ పరిధి కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 148 ఏళ్ల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. 7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు.. 12 కేజీల వెండి, రూ.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు. ఆలయంలో 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు దేవస్థాన సంఘం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్‌, కార్యదర్శి పెనుగొండ కామరాజు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande