
నందిగామ: 10 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంత గ్రామాలకు వస్తున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో.. సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ