
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే (PhonePe), ఆన్లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్వే ప్లాట్ఫామ్లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సాంకేతికత ద్వారా కోట్లాది మంది డెబిట్ , క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభంగా , భద్రంగా పూర్తి చేసే అవకాశం కలిగింది. డివైజ్ టోకనైజేషన్ (Device Tokenisation) అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా, వినియోగదారులు తమ కార్డ్ వివరాలను ప్రతిసారీ నమోదు చేసే శ్రమను ఇది తప్పిస్తుంది.
ఈ ఫీచర్ యొక్క ప్రధాన విశిష్టత ఏమిటంటే, వినియోగదారులు తమ కార్డును ఫోన్పే యాప్లో ఒక్కసారి టోకనైజ్ (సేవ్) చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫోన్పే పేమెంట్ గేట్వేతో అనుసంధానమై ఉన్న ఏ మర్చంట్ యాప్లోనైనా పదేపదే కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు జరపవచ్చు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు