విమానాల తయారీలోకి అదానీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
Gautam Adani


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ.,10 జనవరి (హి.స.)దేశంలో రెండో అతిపెద్ద ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ విమానాల తయారీ విభాగంలోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం బ్రెజిల్‌ ఏరోస్పేస్‌ కంపెనీ ఎంబ్రాయర్‌తో జట్టు కట్టింది. భారత్‌లో తన రీజినల్‌ ప్యాసింజర్‌ జెట్‌ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎ్‌ఫఏఎల్‌)ను ఏర్పాటు చేసేందుకు అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పే్‌సతో ఎంబ్రాయర్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానయాన రంగంలో మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యాలకు ఈ ఒప్పందం ఊతమివ్వనుందని వారన్నారు. 70 నుంచి 146 సీట్ల వరకు సామర్థ్యంతో కూడిన ఎంబ్రాయర్‌ రీజినల్‌ జెట్‌ విమానాలు స్వల్ప, మధ్య స్థాయి దూర మార్గాల్లో ప్రయాణించేందుకు పనికొస్తాయి.

ఫైనల్‌ అసెంబ్లీ యూనిట్‌లో విడిభాగాలన్నింటినీ కూర్చి పూర్తి విమానాన్ని తయారు చేస్తారు. ఫిక్స్‌డ్‌ వింగ్‌ ప్యాసింజర్‌ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్‌ యూనిట్‌ కానుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి, నిర్వహణ, విమానాల ఎంఆర్‌ఓ (నిర్వహణ, మరమ్మతు, సర్వీసింగ్‌), పైలట్ల శిక్షణ విభాగాల్లోకి ప్రవేశించిన అదానీ గ్రూప్‌ తాజాగా ఈ ఒప్పందంతో విమానాల తయారీలోకీ అడుగుపెట్టినట్లవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande