
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ.,10 జనవరి (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై భారత్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్ ఖలీద్కు మద్దతుగా మమ్దానీ లేఖ రాశారు. ఈ కేసులో ప్రస్తుతం, ఖలీద్ జైలులో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అయితే, మమ్దానీ లేఖపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మమ్దానీ ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల పట్ల గౌరంగా ఉండాలని, తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు.
గత నెలలో ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసినప్పుడు మమ్దానీ అతడికి మద్దతుగా లేఖలో సంఘీభావాన్ని తెలియజేశారు. “ప్రియమైన ఉమర్, చేదు గురించి నీ మాటలను నేను తరచుగా గుర్తు చేసుకుంటాను, అది మనల్ని ఆవరించకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమందరం నీ గురించి ఆలోచిస్తున్నాము” మమ్దానీ లేఖలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ