
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతోందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..