
అమరావతి, 11 జనవరి (హి.స.)
దోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇసుక లారీ ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్లోని చింతల సమీపంలో లారీ మరమ్మతులకు గురైంది. దీంతో దోర్నాల నుంచి శ్రీశైలానికి రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిలిచిపోయిన లారీని పక్కకు మళ్లించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ