
హైదరాబాద్, 08 జనవరి (హి.స.)
మున్సిపాలిటీల అభివృద్ధికి మరో విడత నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలకు పలు దఫాలుగా నిధులు మంజూరు చేసిన సర్కార్, తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (SFC) ద్వారా నిధులు రూ.10 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వేగవంతం చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులను మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి, అత్యవసర మరమ్మతులు, మురుగునీటి కాలవల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల మరమ్మతులకు ఉపయోగించడానికి మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..