
హిమాచల్ ప్రదేశ్, 09 జనవరి (హి.స.) హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కుప్వీ నుంచి సిమ్లాకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సిర్మూర్ జిల్లా హరిఫురధర్ ప్రాంతంలోని మారుమూల కొండదారిలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు