
సంగారెడ్డి, 09 జనవరి (హి.స.)
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు. గురువారం అర్ధరాత్రి 200 మందికి పైగా దుండగులు ఓ ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రేలింగ్ పైపులతో డీసీఎం, ట్రాలీ ఆటోల్లో అర్థరాత్రి వేళ వచ్చి హల్ చల్ చేశారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడలను తొలగించి రేలింగ్ పైపులను పాతిపెట్టారు. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేసి వచ్చారు.
వాచ్ మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్ వైజర్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా సలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు రాత్రికి రాత్రే దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..