
హైదరాబాద్, 09 జనవరి (హి.స.)
వారణాసిలో పొగ మంచు కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో, స్పెస్ జెట్ విమానాలు రద్దయ్యాయి.
శుక్రవారం ఉదయం హైదారాబాద్ నుంచి బయల్దేరిన ఈ రెండు విమానాలు కూడా వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..