
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) తెలంగాణ శాసనసభ ఆవరణలో
నూతనంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ ఆవరణలో వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు