
ఆదిలాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)
ఆదిలాబాద్ ను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నయవంచన చేశారు ..ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ ను దత్తత తీసుంటానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు . తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జోగురామన్న మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో ఆదిలాబాద్కు చేసిన పని ఒక్కటీ లేదు.. కేవలం శంఖు స్థాపనలకే పరిమితమయ్యారు. హౌజ్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారు. నన్ను ఎన్నో సార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఈ రోజు పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారు. సీఎం హోదాలో ఉండి ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి కి సిగ్గు అనిపించడం లేదా..? అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi