
కుప్వారా, 09 ఏప్రిల్ (హి.స.)
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లోని కుప్వారా (Kupwara) జిల్లా ప్రధాన బస్టాండ్లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పార్క్ చేసి ఉన్న ఏడు బస్సులు మంటలకు ఆహుతయ్యాయి. అయితే, అర్ధరాత్రి సమయంలో బస్టాండ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 6 బస్సులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించారు. సిబ్బంది సుమారు 7 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో మొత్తం ఏడు బస్సులు కాలిబూడదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. అర్ధరాత్రి కావడం, బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) వల్ల మంటలు చెలరేగాయా, మరేదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV