పేపర్ లీక్ వ్యవహారం.. నీట్ పరీక్ష రద్దు
ఢిల్లీ.12 మే (హి.స.) జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ-2026)కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీకైనట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను (NE
పేపర్ లీక్ వ్యవహారం.. నీట్ పరీక్ష రద్దు


ఢిల్లీ.12 మే (హి.స.) జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ-2026)కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీకైనట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను (NEET Exam) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది.

విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ (NTA) వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

ఈనెల 3న జరిగిన నీట్ (NEET UG 2026) పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులోని సమాచారం.. నీట్ ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande