
అమరావతి, 16 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్http://cets.apsche.ap.gov.in/ICETలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ