
శ్రీ సత్యసాయి జిల్లా: 16 మే (హి.స.)
ధర్మవరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Y. సత్య కుమార్ ఉదయం పర్యటించారు. పట్టణంలోని శివానగర్ దిమ్మిల సెంటర్లో రోడ్డు పక్కన టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. కొంతమంది ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మంత్రి వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని వారు చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని కోరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV