
, కోరుట్ల:, 17 మే (హి.స.)
నాందేడ్-ధర్మవరం మధ్య 17635, 17636 నంబర్లతో వారాంతపు ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు తిరుపతి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది. కోరుట్ల, జగిత్యాల(లింగంపేట), కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లలో ఈ రైలును ఆపనున్నట్లు ద.మ.రై.ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ