
అనంతపూర్, 30 మే (హి.స.)
: అనంతపురం సమీపంలోని హైదరాబాద్- బెంగళూరు రాప్తాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.ఏడుగురికి తీవ్ర గాయాలు. గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుత్తిని తరలించిన పోలీసులు.
మధ్యప్రదేశ్ నుండి కేరళకు తుఫాన్ వాహనంలో లో వలస కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొడంతో ప్రమాదం. ప్రయాణికులంతా రోజువారి కూలీలు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV