ఫ్రూట్ హొరైజన్ 2026’ సదస్సులో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్
ఫ్రూట్ హొరైజన్ 2026’ సదస్సులో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్
ఫ్రూట్ హొరైజన్ 2026’ సదస్సులో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్


లక్నో, 07 మే (హి.స.)

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లక్నోలో జరిగిన ‘ఫ్రూట్ హొరైజన్ 2026’ సదస్సులో పాల్గొని, పండ్ల సాగులో ఆధునిక సాంకేతికత, ఎగుమతుల పెంపు మరియు రైతులకు గిట్టుబాటు ధరలపై అధికారులతో చర్చించారు. ఐకార్-సి.ఐ.ఎస్.హెచ్ (ICAR-CISH) శాస్త్రవేత్తలతో సమావేశమై, మామిడి ఎగుమతుల అడ్డంకుల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, అలాగే పండ్ల ప్రాసెసింగ్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దేశంలో పండ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానిక ి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటుగా ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి, హార్టికల్చర్ శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ మరియు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రగతిశీల రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ప్రతినిధులు ఈ సదస్సులో తమ అనుభవాలను పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande